చెంచు మ‌హిళ‌పై దాడిని ఖండించిన మంత్రి జూప‌ల్లి

53చూసినవారు
చెంచు మ‌హిళ‌పై దాడిని ఖండించిన మంత్రి జూప‌ల్లి
తెలంగాణలోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం మొల‌చింతల ప‌ల్లి గ్రామంలో చెంచు మ‌హిళ‌పై అమానవీయ ఘటన జరిగింది. దీనిపై ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ​స్పందించారు. పాశ‌విక దాడిని ఖండించి, విచారం వ్య‌క్తం చేశారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఎస్పీ వైభ‌వ్ గైక్వాడ్‌కు ఫోన్ చేసి.. కేసు ద‌ర్యాప్తు పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్