పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. "పోలింగ్లో వైసీపీ గూండాల దాడులను టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ధైర్యంగా ఎదిరించారు. పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ, పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.