పవన్‌ కల్యాణ్‌తో రేపు సినీ నిర్మాతల కీలక భేటీ

సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాతలు అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఇతరులు కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం వీరు విజయవాడ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్