కల్తీసారా ఘటన.. బాధితులను పరామర్శించిన కమల్‌హాసన్

76చూసినవారు
కల్తీసారా ఘటన.. బాధితులను పరామర్శించిన కమల్‌హాసన్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ సారా తాగిన వారిలో ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్