ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో శనివారం ఓ షాకింగ్ సంఘటన జరిగింది. భూవివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన తహసీల్దార్తో పాటు రెవెన్యూ బృందంతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఓ రైతు తహసీల్దార్ను చెంప దెబ్బ కొట్టి .. అనంతరం కిందపడేసి దారుణంగా కొట్టాడు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.