ఒకప్పుడు దేశీయ రోడ్లపై దూసుకుపోయిన అంబాసిడర్ కారు మళ్లీ వస్తోంది. హిందుస్థాన్ మోటర్ సంస్థ ఈ నయా అంబాసిడర్ కారుకు మెరుపులు దిద్దుతోంది. ప్రస్తుతం ఈ నయా మోడల్ను తిరిగి విడుదల చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీంతోపాటు అంబాసిడర్లోనే ఈవీని కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సంస్థ యూరోపియన్కు చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తున్నది. ఇందుకోసం రూ.300-400 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నది.