ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో.. ఆయన సాక్షులను ప్రభావితం చేయకుండా నిలువరించేందుకు కస్టడీకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది.