ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, నేతలు సిద్ధం కావాలని సూచించారు. నిన్న హైదరాబాద్ లో టీటీడీపీ నాయకులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమిస్తానని, తెలుగు జాతి ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.