ఛత్తీస్గఢ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫూలోదేవి నేతమ్ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫూలోదేవి కళ్లు తిరిగి కింద పడిపోగానే అక్కడ ఉన్న సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.