తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మల్లారెడ్డి కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కేసీఆర్ విధానాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని అభిప్రాయపడ్డారు.