హైదరాబాద్లో దారుణ హత్య సంచలనంగా మారింది. కాచిగూడ రైల్వే ప్లాట్ఫారమ్లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్ ఫామ్ పై వున్న సిబ్బంది మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కిజార్ అనే వ్యక్తిగా గుర్తించారు.