‘కల్తీ మద్యం మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’

81చూసినవారు
‘కల్తీ మద్యం మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
తమిళనాడులోని కళ్లకురిచిలో నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అస్వస్థతకు గురైన మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్‌ దవాఖానకు తరలించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తమిళనాడు మాజీ సీఎంకు అత్యంత సన్నిహితురాలు వీకే శశికళ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్