హైదరాబాద్లోని శాలీబండ వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మృతి చెందారు. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇక మృతుడు రఫీక్ బిన్ షిమ్లాన్గా.. అతని స్నేహితుడిని ఖలీద్లుగా గుర్తించారు. వీరు శాలీబండ వద్ద రహదారిపై వెళుతుండగా, కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.