ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే “హజ్ యాత్ర” విషాదంగా మారుతోంది. అక్కడికి వచ్చిన యాత్రికులు దారుణమైన వేడి కారణంగా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు 68 మంది భారతీయులతో పాటు కనీసం 1000 మంది మరణించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గురువారం కొత్తగా నమోదైన మరణాల్లో ఈజిప్ట్ దేశానికి చెందిన 58 మంది ఉన్నారు. వేడి కారణంగానే మరణాలు చోటు చేసుకుంటున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.