నిన్న చెన్నై-హైదరాబాద్ మ్యాచ్ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను అత్త కాబోతున్నట్లు శుభవార్తను చెప్పారు. వికెట్ కీపింగ్ చేస్తున్న ధోనీ ఫొటోతో.. 'ప్లీజ్ ఇవాళ మ్యాచ్ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా ఇదే నా అభ్యర్థన' అంటూ సాక్షి తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. దీంతో మామ కాబోతున్న ధోనీకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.