ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో న్యాయవాదులకు చెందిన ఛాంబర్ దగ్ధమైంది. న్యాయవాదులకు సంబంధించిన పలు వస్తువులు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది.