జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గత నెలలో కూడా బారాముల్లా జిల్లా ఉరిలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.