ఆర్థిక ఇబ్బందులు తాళలేక నాలుగేళ్ల కొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం జరిగింది. SI రంజిత్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల లలిత ఆస్పత్రిపాలు కావడంతో వైద్యం కోసం నవీన్ అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక నవీన్ చింతచెట్టుకు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.