పిల్లల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ శివారులో పిల్లల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠాను పట్టుకుని 16 మంది చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్జాదిగూడలో రూ.4.5 లక్షలకు శిశువును ఆర్‌ఎంపీ శోభారాణి విక్రయించారు. దీంతో ఆర్‌ఎంపీ, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్