హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. "ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి." అని సీఎం పేర్కొన్నారు.