BRS చీఫ్ కేసీఆర్ ప్రచారం నిషేధంపై మాజీమంత్రి హరీష్రావు స్పందించారు. 'హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదు. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఈసీకి కనిపించదు. నిషేధం విధించినా.. ప్రజల గుండెల నుంచి కేసీఆర్ను వేరుచేయలేరు' అని వ్యాఖ్యానించారు.