ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై ఇవాళ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. కాగా కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది.