హైదరాబాద్ కూకట్పల్లిలో డ్రగ్స్ ను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్స్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు సమాచారం. బెంగళూరు ఎయిర్ పోర్టులో పనిచేసే రోహిత్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురు విద్యార్థుల కోసం ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారు.