దాయాదుల పోరుకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం నెట్ ప్రాక్టీస్లో హిట్ మ్యాన్ బొటన వేలుకు గాయమైందట. ప్రాక్టీస్ పిచ్లో బంతి ఓవర్ బౌన్స్ అవుతుందని ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం ఇబ్బంది పడ్డారట. ఐర్లాండ్తో మ్యాచులో రోహిత్ గాయం కారణంగా గ్రౌండ్ నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే.