భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు హిట్ పెయిర్ గా మంచి పేరుంది. కానీ ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో వీరు వందకు పైగా పరుగులు ఇచ్చి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. 29 ఓవర్లు వేసిన అశ్విన్ 126 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జడేజా 34 ఓవర్లలో 131 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ ఒక జట్టు పై రెండో ఇన్నింగ్స్ లో వందకు పైగా రన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి.