తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సమస్యలు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో మాజీ సీఎం చిక్కుల్లో పడ్డట్లే అని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు కేసీఆర్ను విచారణకు పిలుస్తారా..? నోటీసులు ఇవ్వనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే అధికారుల విచారణలో రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పినట్లు సమాచారం. ఇంతకీ బీఆర్ఎస్ సుప్రీమో అంటే కేసీఆర్ యేనా కాదా తెలియాల్సి ఉంది.