రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్లో ఓ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. తొలుత దుకాణానికి వెళ్లిన విద్యార్థిని పట్ల సురేశ్ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ రోజు దొరకలేదంటూ ఆమెపై నీళ్లు పోశాడు. అతడి నుంచి తప్పించుకొని యువతి ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. నిలదీసేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులపై సురేశ్ గ్యాంగ్ దాడికి దిగింది. సురేశ్ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.