దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్లో జరిగే అవకాశం ఉంది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు సిఫార్సు చేయనుంది. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమలయ్యేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువును 3 దశల్లో సర్దుబాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించనుందని సమాచారం.