టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ, డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'భజే వాయు వేగం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వర్యమీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.