ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో తీర్పు వాయిదా పడింది. 27 ఏళ్ల క్రితం కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఐదుగురు దళిత యువకులకు గుండు కొట్టించి, మీసం తీయించిన ఘటనలో ఇవాళ తుది తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో తీర్పును ఈనెల 16కు వాయిదా వేశారు.