రహదారిపై మురుగు నీరు పట్టించుకోని అధికారులు

దహెగాం మండలంలోని ఒడ్డుగూడ గ్రామంలో ప్రధాన రహదారిపై మురుగు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు నిలుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు మురుగు నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదని, అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్