మహిళ తలలోకి మెదడు తినే పురుగు ప్రవేశించి మృతి

1064చూసినవారు
మహిళ తలలోకి మెదడు తినే పురుగు ప్రవేశించి మృతి
కొన్ని కీటకాలు మానవ శరీరాన్ని తిని మరణానికి కారణమవుతాయని మీకు తెలుసా? ఇలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం చాలా రోజులుగా ఓ మహిళ (77)కు తల తిరగడం, చికాకుగా ఉండడం, మాట్లాడటం కష్టంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలను చేయడానికి వెన్నెముకలోకి సూదిని చొప్పించినప్పుడు.. ఆమె మెదడులో మట్టిలో నివసించే అమీబా చేరినట్లు తేలింది. ఇది రోగి చనిపోయేంత వరకు వ్యాపించింది. 8 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె మరణించింది.

సంబంధిత పోస్ట్