కర్ణాటకలో సీఎం కుర్చీపై వివాదం చెలరేగుతున్నది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం చేయాలని, ఆ పదవిలో ఉన్న సిద్దరామయ్య తప్పుకోవాలని.. ఇవాళ వక్కలింగ వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వ్యవస్తాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వక్కలింగ కులానికి చెందిన వ్యక్తే.