దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 9 పాయింట్లు పెరిగి 74,095 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 22,484 వద్ధ ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.