బాన్సువాడ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో సీఎం రేవంత్ నేడు భేటీ అయ్యారు. ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఆయనను కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించడమే కాకుండా, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దీనిపై పోచారం సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో పోచారం మంత్రిగా పనిచేశారు.