ఇటలీ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు దేశాధినేతలతోనూ ప్రధాని మోద సంప్రదింపులు జరపనున్నారు.