నేటి వరకు జమ్మూకశ్మీర్లోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని కచ్చితంగా ఆలపించాలనే నియమం లేదు. అయితే ఇకపై జమ్మూకశ్మీర్లోని అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం అసెంబ్లీ సమయంలో జాతీయ గీతం పాడటం విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. విద్యార్థులకు సమాజం, సంస్కృతి, చరిత్ర, పర్యావరణం గురించి అవగాహన కల్పించాలని సూచించింది.