యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున దేశ రాజధానిలో నీటి ఉత్పత్తి నిరంతరం తగ్గుతోందని ఢిల్లీ జల మంత్రి అతిషి శుక్రవారం అన్నారు. ఢిల్లీ వాటా నీటిని హర్యానా విడుదల చేయడం లేదని ఆమె ఆరోపించారు. యమునా నదికి గత వారం నుంచి నీటి విడుదల తగ్గుతోందన్నారు. ఢిల్లీ నీటి సమస్యతో సతమతమవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.