CCTV: పట్టపగలు దోపిడీకి పాల్పడిన ఐదుగురు మహిళలు

67చూసినవారు
యూపీ రాజధాని లక్నోలోని తాజాగా జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. ఓ ఐదుగురు మహిళలు ఆయన ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. మహిళలు ముసుగు ధరించి ఇంట్లో ఉన్న వస్తువులను బ్యాగ్స్ లో వేసుకుని ఎత్తుకెళ్లారు. సీలింగ్ ఫ్యాన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం ఇంట్లో ఉన్న CCTV కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో పోలీసులు మహిళల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్