బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఈడీ ఎదుట లొంగిపోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే.. ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనన్నారు.