తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా కలిసేందుకు జైలు అధికారులు అనుమతించడంలేదని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఆరోపించారు. కేజ్రీవాల్ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్ను కేవలం ములాఖత్ జంగ్లా ద్వారా మాత్రమే కలిసేందుకు అనుమతించారు. వ్యక్తిగతంగా కలిసేందుకు వీలులేదు. ఇది అమానుషం’ అని పేర్కొన్నారు.