మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓటు వేశారు. అయితే, ఓటు వేసిన మోదీ.. బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న ఓ వృద్ధురాలు ఎంతో అప్యాయంగా మోదీ చేతికి రాఖీ కట్టి భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.