ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. తనను నేరుగా కోర్టులో హాజరుపర్చాలని కవిత పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతిచ్చింది. కాగా ఈ కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.