దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తోందని.. జూన్ 4న ఫలితాల వెల్లడి తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతాయని పేర్కొన్నారు. బీజేపీ గెలుపు, మెజార్టీపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయన్న వార్తలను మోడీ ఖండించారు.