కారు ఢీకొని ఇద్దరి మృతి.. 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్

62చూసినవారు
కారు ఢీకొని ఇద్దరి మృతి.. 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్
పుణేలో శనివారం అర్ధరాత్రి ఒక మైనర్ లగ్జరీ కారు పోర్షేను వేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న అతడిని అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన 15 గంటల తర్వాత బెయిల్‌పై బయటపడ్డాడు. నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు. అతను 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలి. అయితే అతడికి బెయిల్ రావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్