భారత స్టార్ షూటర్ శ్రేయాస్ సింగ్కు ఊరట లభించింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తొలుత ప్రకటించిన జట్టులో శ్రేయాస్ సింగ్కు చోటు దక్కలేదు. కానీ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ లో మహిళల పిస్టోల్ స్థానంలో మహిళల ట్రాప్ విభాగం నుంచి ఒకరిని ఎంపిక చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో శ్రేయాస్కు గ్రీన్ సిగ్నల్ లభించింది.