అజయ్ నాగ్వి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు మోహన్భగత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘ఆరంభం’. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అభిషేక్ వి.టి నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మే 10న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.