నేడు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు సర్టిఫికెట్ ఆయనకు ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్లో పంచుకుంటూ తన సర్టిఫికెట్ చూపించారు.