ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ మరణించారు. SI పవిత్రన్ ఏప్రిల్ 27న స్కూటర్పై ప్రగతి మైదాన్ టన్నెల్లో ప్రయాణించారు. ఆ సమయంలో ఆయన స్కూటర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ఎగిరి కింద పడ్డారు. సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.