కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాహుల్ తరచూ ప్రకటిస్తుండడంపై ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు.